ఆంధ్రప్రదేశ్
కాపులకు కాంగ్రెస్ చేసిందేమిటి?: కళా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 24 May 2016
విజయవాడ: 2014కు ముందు రాష్ట్రంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు కాపులకు చేసిందేమీ లేదని ఎపి టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. ఆయన మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, కాపులపై కాంగ్రెస్కు ఇన్నాళ్లూ లేని ప్రేమ ఇపుడు హఠాత్తుగా పుట్టుకొచ్చిందన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, ఎన్నికల ముందు కాపులకు ఇచ్చిన హామీలను తాము దశలవారీగా అమలు చేస్తామన్నారు. తిరుపతిలో జరిగే పార్టీ మహానాడులో రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించి తీర్మానాలను ఆమోదిస్తామని ఆయన తెలిపారు.