కత్రిన.. కరీన మధ్యలో కమల్..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నవకళాపారి పతాకంపై శశాంక వౌళి, పావని జంటగా రత్నా దర్శకత్వంలో శ్రీను విద్యగిరి, ప్రసాద్ కుమార్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘కత్రిన కరీన మధ్యలో కమల్హాసన్’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ హాల్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రత్న మాట్లాడుతూ, ఇదొక ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా నిర్మించామని, షూటింగ్ మొత్తం 47 రోజుల్లో చేశామని, వైజాగ్ బ్యాక్డ్రాప్లో నడిచే ఈ కథలో అందరూ కొత్తవాళ్లే నటించారని తెలిపారు. సినిమాలో కామెడీ ఎమోషన్స్ అందరికీ నచ్చుతాయని, పెళ్లిచేసుకోబోయే అమ్మాయి, అబ్బాయి గురించి ఒకరిగురించి ఒకరు ఏమి ఆలోచిస్తుంటారు? నలుగురు అమ్మాయిలు ఒక దగ్గర కూర్చుంటే అబ్బాయిల గురించి ఏం మాట్లాడతారు? అనే అంశాలతో ఈ సినిమా సాగుతుందని తెలిపారు. సినిమాలో మొత్తం 5 పాటలుంటాయని, ఏప్రిల్ చివరి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ చిత్రానికి మాటలు: వి.ఎస్.పి.తెనే్నటి, సంగీతం:శ్రీకర్, కెమెరా: ప్రసాద్, శ్రావణ్కుమార్, నిర్మాతలు:శ్రీను విజ్జగిరి, ప్రసాద్ కుమార్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం:రత్న.