జాతీయ వార్తలు
కమల్నాథ్ మేనల్లుడి అరెస్టు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 20 August 2019
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ మేనల్లుడు రతుల్పురీని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేశారు. రతుల్పురి మరో నలుగురితో కలిసి ‘మోసెర్ బేర్’ అనే సంస్థను ఏర్పాటు చేసి బ్యాంకుల నుంచి రూ.354 కోట్ల రుణాలు తీసుకుని దుర్వినియోగం చేశాడు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు ఈ నేపథ్యంలో ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు రతుల్పురీతో పాటు డైరక్టర్లు నీతాపురీ, సంజయ్ జైన్, వినీత్ శర్మలపై అభియోగాలు నమోదు చేశారు. ఇదిలావుండగా రతుల్పురీ అగస్టా హెలికాఫ్టర్ కుంభకోణం కేసులోనూ అభియోగాలు నమోదు అయ్యాయి.