తెలంగాణ

ఆ మాటలకు మోసపోవద్దు:కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్: ఎన్నికల సమయంలో ఎన్నో పార్టీల నాయకులు వస్తుంటారని, వాగ్ధానాలు చేస్తుంటారని వారి మాటలకు మోసపోవద్దని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన ఇచ్చోడులో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ గిరిజనుల సమస్యలు కొంతమేరకు పరిష్కరించామని చెప్పారు. తండాలను పంచాయతీలుగా చేసామని, కరెంటు కోత లేకుండా నాణ్యమైన కరెంటును అందిస్తున్నామని తెలిపారు. ఎస్టీలకు, ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని, అసెంబ్లీ ఎన్నికల తరువాత కేంద్రంలో క్రియాశీల పాత్ర పోషించి కేంద్రం మెడలు వంచి రిజర్వేషన్లు అమలుచేస్తామని అన్నారు. కల్యాణ లక్ష్మీ, రైతుబంధు, కేసీఆర్ కిట్ వంటి పథకాలతో ముందుకు వెళుతున్నామని అన్నారు. కాంగ్రెస్‌కు తమతో కొట్లాడే ధైర్యం లేక ఆంధ్ర నుంచి చంద్రబాబును తెచ్చుకుంటున్నారని అన్నారు.