తెలంగాణ

తెలంగాణలో కొత్త జిల్లాలు దసరా నుంచే : కేసీఆర్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: దసరా కానుకగా తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతోందని, ఆ రోజు నుంచే కొత్త జిల్లాలు పని చేస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గోల్కొండ కోటపై కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం లుంబినీ పార్కులో అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి గ్రామానికి పూర్తిస్థాయి విద్యుత్‌ను అందిస్తామన్నారు. మిషన్‌ భగీరథ పనుల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి మంచినీటితో పాటు ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించేందుకు పనులు జరుగుతున్నట్లు తెలిపారు. రూ.600కోట్ల వ్యయంతో ఆస్పత్రుల్లో నూతన వైద్య సామాగ్రి సమకూర్చనున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి శౌర్య పోలీసు పతకాలు పొందిన వారికి కేసీఆర్‌ అభినందనలు తెలిపారు.