తెలంగాణ

కాంగ్రెస్ భ్రష్టుపడుతోంది: కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెరాస పాలనలో తెలంగాణ నాశనమవుతోందని కొందరు కాంగ్రెస్ నేతలు విష ప్రచారం చేస్తున్నారని, నిజానికి కాంగ్రెస్ పార్టీయే భ్రష్టుపడుతోందని సిఎం కెసిఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు భాస్కరరావు, రవీంద్రకుమార్, జి.వినోద్, వివేక్ తదితరులు తెరాసలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్ నేతలకు ఇపుడు మాట్లాడే నైతికహక్కు లేదన్నారు. రాజకీయ సుస్థిరత కోసమే ఇతర పార్టీల వారిని తెరాసలో చేర్చుకుంటున్నామని వివరించారు. తెరాస అధికారంలోకి వచ్చినపుడు కాంగ్రెస్, టిడిపిలు తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేయగా, తనకు మద్దతు ఇచ్చేందుకు ఎంఐఎం పార్టీ ముందుకు వచ్చిందన్నారు. తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ జరగాల్సిందేనని ఆయన అన్నారు. బంగారు తెలంగాణ కోరుకునేవారెవరైనా, ఏ పార్టీకి చెందిన వారైనా తెరాసలో చేరాలని అన్నారు.