కడప

గురువుకు పాదపూజ చేసిన విప్ మేడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, నవంబర్ 14: రాజంపేట శాసన సభ్యులు, విప్ మేడా వెంకట మల్లికార్జునరెడ్డి చిల్డన్స్ డే సందర్భంగా రాజంపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో తన గురువుకు పాదపూజ చేశారు. చిల్డన్స్ డే సందర్భంగా పట్టణంలోని శ్రీ నలందా రెసిడెన్సీ స్కూల్లో బుధవారం శతమానం భవతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తనకు పాఠాలుచెప్పిన గురువు శ్రీరాములునాయుడుకు పాదపూజ చేసి తన గురుభక్తిని చాటుకున్నారు. విప్ పదవిలో ఉన్నప్పటికి ఎంతఎదిగినా ఒదిగి ఉండడం తననైజంగా చిన్నతనంలో విద్యాబోధన చేసినటువంటి గురువును గుర్తుంచుకొని పాదపూజచేయడం అందరిని ఆశ్చర్యపడేలా చేసింది. ఈ సందర్భంగా మేడా వెంకట మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ తాను ఈ రోజు తనకు చదువుచెప్పిన గురువుకు పాదపూజ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో తృప్తి నిచ్చిందన్నారు. చిన్నారులకు తమ తల్లిదండ్రుల పట్ల, పెద్దలపట్ల ప్రేమ గౌరవ మర్యాదలు పెంపొందించేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో తనకుకూడా గురువుకు పాదపూజచేసే భాగ్యం లభించిందన్నారు. నేటి సమాజంలో ప్రస్తుత పరిస్థితులలో యువత మనోభావాలు విపరీతంగా ఉంటున్నాయని, వారిని మంచి మార్గంలో నడపాలంటే చిన్నతనం నుండి మంచి గురువు పర్యవేక్షణ చాలా అవసరమన్నారు. స్కూల్ సిఇఓ శ్రీరాములునాయుడు మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు అవసరమైన అన్ని విలువైన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.