ఆంధ్రప్రదేశ్
కారు బోల్తా: నలుగురి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 24 March 2016
ఒంగోలు: బంధువుల ఇంట్లో కర్మకాండకు హాజరై వెళుతుండగా కారు బోల్తాపడి నలుగురు మరణించిన ఘటన అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి వద్ద గురువారం మధ్యాహ్నం జరిగింది. నెల్లూరు జిల్లా గూడురుకు చెందిన అయిదుగురు వ్యక్తులు గుంటూరు జిల్లా శ్రీరాంపురంలో కర్మకాండకు హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో టైరు పేలడంతో కారు బోల్తాపడింది. సంఘటన స్థలంలో నలుగురు మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆస్పత్రిలో చేర్పించారు.