జాతీయ వార్తలు
అబ్బాయిలతో ఆ ప్రతిజ్ఞ చేయించాలి..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 13 December 2019
న్యూఢిల్లీ: దిశ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. అమ్మాయిల పట్ల గౌరవంగా నడుచుకుంటామని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో అబ్బాయిల చేత టీచర్లు ప్రతిజ్ఞ చేయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించబోమని తమ సోదరులకు ఆడపిల్లలు, తమ మగ బిడ్డలకు తల్లిదండ్రులు సూచించాలని కోరారు. దేశ రాజధానిలో మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ మూడు వేల సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు.