జాతీయ వార్తలు

పార్టీ మనుగడలో కార్యకర్తలే కీలకం:కేజ్రీవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పార్టీ మనుగడ సాగించాలంటే కార్యకర్తలే కీలకం అని ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరించాల్సిందేనని అన్నారు. ఢిల్లీలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నో అవమానకర ఘటనలు ఎదుర్కొన్నా వెనుకడుగు వేయలేదని అన్నారు. వచ్చే సంవత్సరం జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని అన్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఆప్ చేసిన కార్యక్రమాలను వివరించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో మనం ‘ పోరాడుదాం..గెలుద్దాం’ అనే నినాదంతో ముందుకు సాగాలని అన్నారు. కాగా సార్వత్రిక ఎన్నికల్లో ఆప్ అభ్యర్థులకు ఘోర పరాజయం ఎదురైంది. ముగ్గురు అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు.