జాతీయ వార్తలు
కేరళకు తక్షణ సాయం రూ.500 కోట్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 18 August 2018
తిరువనంతపురం: భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్న కేరళకు తక్షణ సాయంగా ప్రధాని నరేంద్ర మోదీ రూ.500 కోట్ల సాయాన్ని ప్రకటించారు. శనివారం ఆయన అధికారులతో, ముఖ్యమంత్రితో సమీక్ష నిర్వహించారు. తొలుత వాతావరణ పరిస్థితులు అనూకలించకపోవటంతో ఆయన ఏరియల్ సర్వే నిర్వహించలేకపోయారు. తదనంతరం వాతావరణం అనుకూలించటంతో ఏరియల్ సర్వే నిర్వహించి వరద నష్టాన్ని పరిశీలించారు. అలాగే ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కటుంబాలకు రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడిన బాధితులకు రూ.50,000లు ప్రకటించారు. వరద కారణంగా ఇప్పటి వరకు రూ.10 వేల కోట్ల నష్టం సంభవించినట్లు ప్రాధమిక అంచన. ఇప్పటి వరకు 300 మంది చనిపోయారు. లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.