తెలంగాణ
నారాయణ్ ఖేడ్ లో 78 శాతం పోలింగ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 13 February 2016
మెదక్: నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక సందర్భంగా శనివారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. సుమారు 78 శాతం పోలింగ్ జరిగిందని, గతంలో కంటే ఎక్కువ మంది ఓట్లు వేశారని అధికారులు తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని అధికారులు తెలిపారు. పోలింగ్ శాతం భారీగా పెరగడంతో గెలుపు తమదేనని, మిగతా పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని తెరాస నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.