జాతీయ వార్తలు
కిడ్నీ రోగులకు ప్రభుత్వం అండ:ఈటెల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 20 September 2019
హైదరాబాద్: కిడ్నీ రోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఆయన శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ..పది వేల మందికి డయాలసిస్ నిర్వహిస్తున్నామని,
ఒక్కో పేషెంట్పై ఏడాదికి రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షలు ఖర్చు పెడుతున్నామని, డయాలసిస్ సెంటర్లు ఇంకా పెంచుతామని మంత్రి ఈటల భరోసానిచ్చారు.ఈసందర్భంగా ఆలేరు ఎమ్మెల్యే సునీత ఈ ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ కిడ్నీ సమస్య వల్ల తన తండ్రి పడ్డ బాధ గురించి చెబుతూ కన్నీటిపర్యంతమయ్యారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో తన తండ్రి చనిపోయారని, ఆ సందర్భంలో తాము అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు.