రాష్ట్రీయం

బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్న కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధ్వజమెత్తిన బిజెపి నేత కిషన్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 4: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎలాగైన గెలువాలని టిఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందని, ప్రజా ప్రతినిధులను బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇటీవల బిజెపిలో చేరిన మాజీ మున్సిపల్ చైర్మన్ జి.సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం మల్కాజిగిరిలోని తిరుమల గార్డెన్స్‌లో భారీ సభను ఏర్పాటు చేశారు. జిఎస్‌ఆర్ అనుచరులు కిషన్‌రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయివరకు ప్రజా ప్రతినిధులను అనేక ప్రలోభాలకు, బెదిరింపులకు గురి చేస్తూ టిఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని విమర్శించారు. కేసిఆర్ తన మాయమాటలతో గారడీ చేస్తూ అందరిని అయోమయం చేస్తున్నారని అన్నారు. గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని విద్యుత్, నల్లా బకాయిలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించటం ఎంత వరకు సమంజమని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో కేసిఆర్ రాజ్యాంగేతర శక్తిగా పాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసిఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా గ్రేటర్‌లో బిజెపి జెండా ఎగరవేస్తామని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో మల్కాజిగిరిలో ఎక్కువ కార్పొరేటర్ స్థానాలను కైవసం చేసుకుంటామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వ పథకంగానే ప్రచారం చేసుకోవటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.