ఖమ్మం

జగదానంద కారక..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, ఏప్రిల్ 4: జగన్నాధుని కళ్యాణ ఘడియలు సమీపించాయి. జగదభిరాముడి జగత్కల్యాణాన్ని కళ్లారా వీక్షించాలని జగమంతా భద్రాద్రిలో తిష్టవేసింది. రఘురాముడు శ్రీరాముడు.. సుగుణాల రాశి సీతమ్మ పక్కన కూర్చుంటే.. ఆ దృశ్యం వీక్షించి పులకించిపోవాలని భక్త కోటి భద్రాద్రికి పయనమైంది. భక్త జన తాకిడితో భద్రాద్రి కిటకిటలాడుతోంది. అశేష భక్త జనవాహిని నడుమ నేడు రామయ్య కల్యాణం వైభవోపేతంగా జరగనుంది. శిల్పకళా శోభితమైన మిథిలా నగరం కళ్యాణ మండపంలో రామయ్య సీతమ్మను పరిణయమాడనున్నారు. దీనికోసం యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. చలువ పందిళ్ల నీడలో.. గోదావరి పుణ్యస్నానాలు ఆచరించి ఒళ్లంతా కళ్లు చేసుకొని భక్త కోటి జగత్కల్యాణం వీక్షించేందుకు ఎదురు చూస్తోంది. మరికొద్ది గంటల్లో దశరథ తనయుడు శ్రీరాముడు, జనక మహారాజు కుమార్తె సీతమ్మను కల్యాణమాడనున్నారు. ఈసారి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలతో భద్రాద్రికి రానున్నారు. దీంతో యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేసింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఎస్పీ అంబర్‌కిశోర్ ఝా ఏర్పాట్లు పరిశీలించారు.
సర్వం సిద్ధం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో బుధవారం అంగరంగ వైభవంగా జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి భద్రాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మరికొన్ని గంటల్లో లోక కళ్యాణం జరగనుంది. సప్తవర్ణాల వెలుగులు, సరికొత్త హంగులతో భద్రాద్రి పట్టణానికి కళ వచ్చేసింది. ఎండలు మండుతున్నా లెక్క చేయకుండా భక్తులు రామయ్య కల్యాణం తిలకించేందుకు ముందుగానే భద్రాచలం చేరుకున్నారు. రామనామ స్మరణతో భక్తులు రామయ్యను కొలుస్తున్నారు. పట్టణంలో ఏ వీధి చూసినా రామనామ స్మరణతో పులకించిపోతోంది. కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేవాదాయ, రెవెన్యూ, పంచాయతీరాజ్, ట్రాన్స్‌కో, ఇరిగేషన్ తదితర శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు చలువ పందిళ్లు, షామియానాలు ఏర్పాటు చేశారు. మంచి నీటి సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. స్వచ్చంధ సంస్థలు సేవలు అందిస్తున్నాయి. పోలీసులు భద్రాద్రిని తమ ఆధీనంలోకి తీసుకుని గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రామయ్య కల్యాణానికి వేదికైన మిథిలా స్టేడియం శిల్పకళా శోభితమై లోక కల్యాణానికి సిద్ధమైంది. మిథిలా స్టేడియాన్ని పోలీసులు ముమ్మరంగా తనిఖీ చేశారు.
అభిజిత్ లగ్నంలో..
వసంతపక్ష ప్రయుక్తంగా నవాహ్నిక దీక్షతో జరిగే బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన మహోత్సవం సీతారాముల కల్యాణం. ఈ వివాహ వేడుక బుధవారం అభిజిత్ లగ్నంలో ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు జరగనుంది. కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించేందుకు దైవజ్ఞులు ఈ ముహూర్తాన్ని నిర్ణయించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశంలోని నలుమూలల నుంచి ముందుగానే వచ్చిన భక్తులు మంగళవారం రామయ్యను దర్శించుకున్నారు. భక్తుల తాకిడితో రామాలయంలో రద్దీ ఏర్పడింది. గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు రామదర్శనం కోసం బారులు తీరారు.
పోలీసుల ఆధీనంలో భద్రాద్రి
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం, స్వామి పట్ట్భాషేకం మహోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. కల్యాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్, పట్ట్భాషేక మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, న్యాయమూర్తులు రానున్న నేపథ్యంలో పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసింది. 2500 మంది పోలీసు సిబ్బందితో పాటు సీఆర్‌పీఎఫ్, గ్రేహౌండ్స్ బలగాల సాయంతో భద్రాచలం చుట్టూ భద్రతా వలయం ఏర్పాటు చేశారు. సిఎం, గవర్నర్ రాక కోసం ఏర్పాటు చేసిన హెలీప్యాడ్, వసతి గృహం, కళ్యాణ మండపం తదితర ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. సిఎం భద్రతా సిబ్బంది ముందుగా సిఎం వసతి గృహాన్ని స్వాధీనం చేసుకున్నారు.