క్రైమ్/లీగల్

మునే్నరులో పడి ఇద్దరు విద్యార్థుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(క్రైం), మార్చి 14: ఖమ్మం మునే్నరులో పడి ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో ఇరువురు విద్యార్థులు మునే్నరు వద్దకు వెళ్ళారు. స్నేహితులైన ఇరువురు విద్యార్థులు ఒకేసారి మరణించడం హృదయ విదారకంగా ఉంది. ఖమ్మంలోని ప్రైవేటు కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు మొదటి నుంచి కలిసి ఉండేవాళ్ళని, మృత్యువు కూడా వాళ్ళని విడతీయలేకపోయిందని తోటి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో ఇరువురు సరదాగా ఉండేందుకు మునే్నరుకు వెళ్ళి మృత్యువాత పడ్డారు. రాహుల్(17) నీళ్ళలో పడుతుండగా ప్రణయ్(17) కాపాడే ప్రయత్నంలో నీళ్ళలో పడిపోయారు. ఇరువురు అక్కడికక్కడే మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.