ఖమ్మం

తెలుగుదేశంలో చేరిన లత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), నవంబర్ 14: టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకురాలు రాయల లత బుధవారం నామా ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ఖమ్మం మహాకూటమి టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో ఎంపీటీసీగా ఎన్నికై తెలుగుదేశం పనిచేశారు. తుమ్మల నాగేశ్వరరావు తెలుగుదేశం నుండి టీఆర్‌ఎస్ పార్టీలోకి చేరిన సమయంలో ఆమె కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇటీవల కాలంలో టీఆర్‌ఎస్‌పై అసంతృప్తిగా ఉంటూ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నామాను ప్రకటించటంతో ఆమె టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరారు.
మాతాశిశు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్
ఖమ్మం(మామిళ్ళగూడెం), నవంబర్ 14: జిల్లా ప్రధానాసుపత్రిలోని మాతాశిశు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ బుధవారం సందర్శించారు. ఆసుపత్రిలో గర్భిణులకు అందుతున్న సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్‌ను, చిన్నారులకు ఏర్పాటు చేసిన ఉయ్యాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డెలివరి అయిన తరువాత చిన్నారులు బెడ్‌మీద నుంచి కిందపడటం లాంటి సంఘటనలు జరగకుండా ఉయ్యాలను ఏర్పాటు చేశామన్నారు. వైద్యులు, గర్భిణీల పట్ల అప్రమత్తంగా ఉండి వారికి వైద్యసేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కళావతిబాయి, ఆసుపత్రి సూపరిండెంటెంట్ మదన్‌సింగ్, సంక్షేమాధికారి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.