ఖమ్మం

ప్రజా పోరాటాలు నిర్వహించే పార్టీలకే మద్దతునివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార్ల, నవంబర్ 17: పాలక విధానాల వల్ల సమస్యలతో సతమతమవుతున్న ప్రజా పోరాటాలకు మద్దతునిచ్చే పార్టీలకే ఈ ఎన్నికల్లో సహకారం అందించాలని న్యూడెమోక్రసి మహబూబాబాద్ జిల్లా నాయకుడు జి సక్రు కోరారు. న్యూడెమోక్రసి ఇల్లెందు నియోజకవర్గ అభ్యర్థి గుమ్మడి నర్సయ్య విజయం కోరుతూ శనివారం గార్ల మండలం పరిధిలోని చిన్నకిష్టాపురం, దేశ్యాతండా, సర్వన్‌తండాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన అనంతరం చిన్నకిష్టాపురంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఉద్యమ పార్టీగా గద్దెనెక్కిన కెసిఆర్ నాలుగున్నర సంవత్సరాల్లో గద్దల బుద్ది చూపించి నిరంకుశ వైఖరితో ప్రజలను ఆందోళనకు గురి చేశారని ఆరోపించారు. టిఆర్‌ఎస్ పార్టీ గత ఎన్నికల సమయంలో చేసిన హామీలు నెరవేర్చకపోగా అధికార కైవసానికి చేస్తున్న జిమ్మికులను నమ్మవద్దని ప్రజలను కోరారు. అధికారం ఉన్నా లేకున్న నిరంతరం ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్న ఎన్డీ అభ్యర్థి గుమ్మడి నర్సయ్యకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని సక్రు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం, పిఓడబ్ల్యూ నాయకులు హరి, చిన్న, దర్బార్, రవీందర్, అజయ్, సేట్రాం, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.