ఖమ్మం

భక్తరామదాసు జన్మస్థలంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేలకొండపల్లి, డిసెంబర్ 18: ముక్కోటి ఏకాదశి పర్వదినంను పురస్కరించుకొని దేవాలయాలలో దేవతామూర్తులు ఉత్తరద్వారం ద్వార భక్తులకు దర్శనం ఇచ్చారు. మంగళవారం ఏకాదశి సందర్బంగా ఉదయం నుండే దేవాయాలకు భక్తులు బారులు తీరారు. నేలకొండపల్లిలోని శ్రీ భక్తరామదాసు మందరంలో భక్తులకు ఉత్తరద్వారం ద్వార శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనం ఇచ్చారు. అలాగే శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం, శ్రీ ప్రసన్నఆంజనేయస్వామి దేవాలయం, శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం, శ్రీ ఉత్తరేశ్వరస్వామి దేవాలయం, శ్రీ కోనేరు ఆంజనేయస్వామి దేవాలయం, శ్రీ భీమేశ్వరస్వామి దేవాలయం, శ్రీ రామాలయం దేవాలయాలలో దేవత మూర్తులు ఉత్తరద్వారం ద్వార భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్బంగా దేవాలయాలను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. ఉత్తరద్వార దర్శనం కోసం భక్తులు ఉదయం నుండే దేవాలయాల ముందు బారులు తీరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వంగవేటి నాగేశ్వరరావు, గెల్లా కృష్ణారావు, షరాబు శ్రీను, దేవరశెట్టి లక్ష్మణ్‌రావు, రాయపూడి ప్రసాద్, తోట వెంకటేశ్వర్లు, పావులూరి వెంకటేశ్వరావు, గరిణే రామకృష్ణ, గెల్లా జనార్దన్, దోసపాటి శేఖర్, రామయ్య, వంగవేటి నవీన్ తదితరులు పాల్గొన్నారు.