ఖమ్మం
కార్యాలయాలను సందర్శించిన జిల్లాకలెక్టర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తిరుమలాయపాలెం, జనవరి 23: స్థానిక ప్రభుత్వ కార్యాలయాలను జిల్లాకలక్టర్ అర్వి కర్ణన్ బుధవారం సందర్శించారు. ఈ ఆసుపత్రిని ఇటీవల నిర్మించారు. ఈ ఆసుపత్రిలోని ల్యాబర్రూంను, టీకాలు వేసే గదిని, ఆసుపత్రి వైద్యుని గదిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రి వైద్యులు రామారావును ఎంతమంది రోగులు ప్రతిరోజు వస్తున్నారు, రోగులకు సరిపడ మందులు ఉన్నాయా, ఎవైన సౌకర్యాలు కావాలా, ఆసుపత్రి సిబ్బంది అవసరమా అని అడగితెలుసుకున్నారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న సేవలు పెరగాలని, ప్రభుత్వాసుపత్రికి రోగులు అధికంగా వచ్చేవిధంగా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం స్థానిక జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ బ్రాంచి కార్యాలయాన్ని సందర్శించారు. బ్యాంక్మేనేజర్ దుర్గాదేవిన పలు ప్రశ్నలు అడిగారు. బ్యాంక్లో డిపాజిట్లు ఏలా ఉన్నాయి, లోనింగ్ ఎలా కొనసాగుతుంది తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
జనన వివరాలను ఆన్లైన్లో పొందుపర్చాలి
ఖమ్మం(మామిళ్ళగూడెం), జనవరి 23: జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో జరుగుతున్న జనన వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా పొందుపర్చాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కళావతిబాయి అన్నారు. ఆసుపత్రులలో జరిగే ప్రసవాలు, జననాలు జనవరి 1 నుండి ఇబర్త్ ద్వారా ఆన్లైన్లో నమోదుచేస్తున్నామని అన్ని ఆసుపత్రులకు సంబందించిన ఐడి పాస్వర్డులు ఇచ్చామని పేర్కొన్నారు. దీని ద్వారా బర్త్ సర్ట్ఫికెట్ వెంటనే పొందవచ్చని, తల్లిబిడ్డకు సంబందించిన వైద్యసేవలు అందించుటకు వీలు కలుగుతుందని తెలిపారు. ఆన్లైన్ నమోదు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెలలో ఇప్పటివరకు ప్రైవేట్ ఆసుపత్రులలో 491ప్రసవాలు, 61 సాదారణ ప్రసవాలు, సి సెక్షన్ ఆపరేషన్ ద్వారా 430ప్రసవాలు జరిగాయని వాటిలో మగ పిల్లలు 269మంది, ఆడపిల్లలు 232మంది జన్మించారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో 579 ప్రసవాలు జరగగా వీటిలో 157 సాదారణ ప్రసవాలు, సి సెక్షన్ ఆపరేషన్ ద్వారా 418ప్రసవాలు జరిగాయని వీటిలో 304మంది మగపిల్లలు, 278మంది ఆడపిల్లలు జన్మించారని తెలిపారు.