ఖమ్మం

మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన టిఆర్‌ఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), మే 15: 17వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని టిఆర్‌ఎస్ ప్రభుత్వం 2 ఏళ్ళల్లోనే అప్పుల పాలు చేసిందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు తుళ్ళూరి బ్రహ్మయ్య విమర్శించారు. ఆదివారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మట్లాడుతూ పాలేరు ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే కాంగ్రెస్ పార్టీకి టిడిపి మద్దతు ఇచ్చిందన్నారు. కెసిఆర్ కుటుంబం అక్రమ సంపాదన కోసమే మీషన్ భగీరధ వంటి పథకాలను చేపడుతుందని విమర్శించారు. కేజి టు పిజి, డబుల్‌బెడ్ రూం ఇళ్లు, దళితులకు భూమి తదితర హామీలను ఇచ్చిన కెసిఆర్ ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. పాలేరు ప్రజలు ఈ ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి బుద్ధిచెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో స్వర్ణకుమారి, తోటకూరి శివయ్య, ఉండేటి భిక్షం, రవి తదితరులు పాల్గొన్నారు.