ఖమ్మం

పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), జూన్ 21: పోడు భూములకు హక్కు పత్రాలు పంపిణి చేయటంతో పాటు గిరిజన రైతులపై నమోదు చేసిన కేసులను ఎత్తి వేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ భద్రునాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు అండదండలుగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. లక్ష ఎకరాల భూమిని పరిశ్రమల పేరుతో కార్పొరేట్ శక్తులకు దారదత్తం చేస్తుందని విమర్శించారు. పోడు రైతుల సమస్యలపై గత ప్రభుత్వాలు వ్యవహరించిన తీరులో కాకుండా సమస్యల శాస్వత పరిష్కరాలకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోడు రైతులపై సాగిస్తున్న దమనకాండను నిలిపివేసి, వారికి హక్కుల పత్రాలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగరాజు, కిషోన్, నాగేంద్ర, రమేష్, హరి, బాలు తదితరులు పాల్గొన్నారు.