ఖమ్మం

నగరాభివృద్ధికి సహకరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), మార్చి 27: నగరాభివృద్ధి పనుల్లో భాగంగానే తమ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ సారధినగర్‌లో పనులు ప్రారభించారని, దానిని టిఆర్‌ఎస్ నేతలు రాద్ధాంతం చేయటం వారికే చెల్లిందని కాంగ్రెస్ కార్పొరేటర్లు బాలగంగాధర్‌తిలక్, రుద్రగాని శ్రీదేవి, కె సరిత అన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో నగరంలో ప్రారంభించిన అనేక పనులకు సంబంధించి ఎమ్మెల్యేకు కూడ తెలియపర్చాలనే ఆలోచన కూడా లేకుండా అధికార పార్టీ నేతలు ప్రారంభించారని, వారికి ఇప్పుడు ప్రోటోకాల్ గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. మేయర్, డిప్యూటి మేయర్ తమ డివిజన్‌లలో తిరుగుతున్నప్పటికి తమకు ఎటుంవంటి సమాచారం ఇవ్వటం లేదన్నారు. నగరాభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, తమవంతుగా సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. విలేఖరుల సమావేశంలో నాయకులు ఉపేందర్, రఘు తదితరులు పాల్గొన్నారు.