కర్నూల్

రాబోయే ఎన్నికల్లో వైసీపీదే విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానంది, నవంబర్ 19: 2019లో జరిగే ఎన్నికల్లో వైకాపా విజయం సాధిస్తుందని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన మహానంది పుణ్యక్షేత్రంలో కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. అనంతరం వారు పాత్రికేయులతో మాట్లాడుతూ పార్టీలు మారే వారిని ప్రజలు నమ్మరని, ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరే వారిని ప్రజలు ఎలా నమ్ముతారన్నారు. తెలంగాణలో టీ ఆర్ ఎస్‌కే విజయ సూచికలు కనిపిస్తున్నాయన్నారు. మహాకూటమికి ఒకప్పుడు బలం ఉన్నా ప్రస్తుతం మహాకూటమి బలహీనమైందన్నారు. ఆయన వెంట వచ్చిన ఈ ఈ సుబ్బారెడ్డి మాట్లాడుతూ పంచాయతీలలో రోడ్లు, డ్రైనేజిల పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ఇటీవల పుష్కర నిధులు దాదాపు రూ. 40 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని, ప్రస్తుతం జిల్లాలో దాదాపు రూ. 60 కోట్లతో గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజి పనులు జరుగుతున్నాయన్నారు.