కృష్ణ

కాలువలకు చేరిన గోదావరి జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు,జూన్ 27: మండలంలోని కెఈబీ కెనాల్, బందరు కాలువలకు మంగళవారం గోదావరి జలాలు చేరుకున్నాయి. సోమవారం విజయవాడలో సీఎం చంద్రబాబు పట్టిసీమ నుంచి వచ్చిన గోదావరి జలాలను కాలువలకు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ నీరు కాలువలకు చేరటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జాన్ నెలలో సాగునీరు రావటం ఆనందంగా ఉందని రైతులు చెపుతున్నారు. బోర్లు లేని రైతులు నారుమడులు పోసుకునేందుకు కాలువల్లోకి వచ్చిన నీరు ఉపయోగపడుతుందని అంటున్నారు. త్వరగా వరినాట్లు వేయాలని సూచిస్తున్న ప్రభుత్వం అందుకు తగ్గట్టుగానే కాలువలకు సాగునీటిని విడుదల చేసిందని రైతులు అంటున్నారు.