కృష్ణ

బాబు మెప్పు కోసమే తమ్ముళ్ల తపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంజిసర్కిల్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెప్పు కోసమే తెలుగు తమ్ముళ్లు తపన పడుతూ పదేపదే విపక్షాలపై విమర్శలు చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దారా సాంబయ్య అన్నారు. అన్ని రంగాల్లో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న బాబు ప్రజాస్వామ్యాన్ని కూడా ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. నగరంలో అదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రజాస్వామ్య విలువలకు తిలోదాకాలు ఇచ్చారన్నారు. 21 మంది ప్రతిపక్ష వైకాపా ఎమ్మెల్యేలను తీసుకుని వారికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలకు పథకాలు అందకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు.
మనకోడి, సునందిని వంటి ఎవరికీ ఉపయోగం లేని పథకాలను బాబు ప్రవేశపెడుతున్నారని చెప్పారు. నాటి రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడైన చంద్రబాబు పదేళ్లు హైదరాబాద్‌లో ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చి అధికారులను ఇబ్బందులపాలు చేస్తున్నారని విమర్శించారు. కర్నాటక ఎన్నికల్లో టీడీపీ ప్రచారం కారణంగానే బీజేపీ ఓటమి చెందిందని బాబు చెప్పడం శోచనీయమన్నారు. కుమారస్వామి పదవి మూన్నాళ్ల ముచ్చటేనని, ఆయన ప్రమాణస్వీకారం చేయకుండానే కాంగ్రెస్, జేడీఎస్ నాయకుల మధ్య పదవుల కోసం గొడవ మొదలైందని సాంబయ్య అన్నారు. మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ మాట్లాడుతూ జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల సమయంలో దారుణంగా విమర్శించుకుని ఇప్పుడు అధికారం కోసం కలిసి పాకులాడుతున్నాయన్నారు. యడ్యూరప్ప హుందాగా వ్యవహరించి బలనిరూపణకు ముందే రాజీనామా చేశారని ఆయన స్పష్టం చేశారు.