కృష్ణ

సముద్రంలో మునిగి యువకుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూన్ 17: సరదాగా స్నేహితులతో కలిసి మంగినపూడి బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లిన ఆ యువకుడిని విధి కబళించింది. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా సముద్రంలో కేరింతలు కొడుతున్న ఆ యువకుడిని రాకాసి అలలు ఒక్కసారిగా మింగేసాయి. ఈ హఠాత్పరిణామానికి సహచర స్నేహితులు నిచ్చేష్ఠులయ్యారు. ఒక్కసారిగా తీరంలో విషాదం అలుముకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెనమలూరు మండలం పెదపులిపాక గ్రామానికి చెందిన గొడవర్తి ప్రేమ్ జీ (17) ఆదివారం మధ్యాహ్న సమయంలో మరో ఆరుగురు స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికై మంగినపూడి బీచ్‌కు వచ్చారు. 3.30ని.ల సమయంలో సముద్రంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన అలలకు ప్రేమ్‌జీ ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఉక్కిరిబిక్కిరైన నిమిషాల్లో ప్రేమ్‌జీ గల్లంతు కావటంతో సహచర స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, మెరైన్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 4.30ని.ల సమయంలో సముద్రంలో ప్రేమ్‌జీ తేలుతూ కనిపించటంతో హుటాహుటిన మెరైన్ పోలీసులు ఒడ్డుకు తీసుకు వచ్చారు. అయితే అప్పటికే ప్రేమ్ జీ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని కుమారుడి భౌతికకాయాన్ని చూసి కన్నీరుమున్నీరై విలపించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలుకా ఎస్‌ఐ రంగనాధ్ తెలిపారు. మృతుడు ప్రేమ్‌జీ పెనమలూరులో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పూర్తి చేసి ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లు తెలిపారు.