కృష్ణ

అవిశ్వాసంపై అదే పట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ: గుడివాడ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు అవిశ్వాసంపై వెనక్కి తగ్గేదిలేదని సైకిల్ గుర్తుపై గెల్చిన టీడీపీ కౌన్సిలర్లు మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు తెగేసి చెప్పారు. కౌన్సిల్‌లో టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న లింగం ప్రసాద్‌కు చివరి ఏడాది చైర్మన్ పదవి ఇవ్వాలని వారంతా ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. గురువారం రాత్రి 12గంటల వరకు మంత్రి ఉమాతో టీడీపీ కౌన్సిలర్ల చర్చలు కొనసాగాయి. ఈ చర్చల్లో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జిలు కూడా పాల్గొన్నారు. 2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసిన లింగం ప్రసాద్ అనేక వ్యయప్రయాసలతో పోరాడినా అత్యధిక వార్డులు గెల్చుకోకపోవడంతో ఆయనకు చైర్మన్ పదవి దక్కలేదు. ఈ విషయాన్ని మంత్రి దేవినేని ఉమాకు టీడీపీ కౌన్సిలర్లు వివరించారు. అయితే ప్రస్తుతం ఎంపీ కొనకళ్ళ నారాయణ పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నారని, ఈ నెల 24న మరోసారి సమావేశమై సమస్యను పరిష్కరించుకుందామని మంత్రి హామీ ఇచ్చారు.