కృష్ణ

వచ్చే ఎన్నికల్లో ధనానికి, జనానికి మధ్య పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట: రానున్న ఎన్నికల్లో ధన బలానికి, ప్రజా బలానికి పోటీ జరగబోతుందని, ప్రజలు ధన బలానికి తగిన బుద్ది చెప్పాలని వైసీపీ విజయవాడ పార్లమెంటరీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను అన్నారు. శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌పై పలు ఆరోపణలు సంధించారు. అవినీతి అక్రమాలను పెంచి పోషిస్తున్నారని, నియోజకవర్గంలో ఆయన, ఆయన సోదరుల అండదండలతో ఇసుక, మట్టి, బియ్యం, గుట్కా వ్యాపారాలు సాగుతున్నాయని ఆరోపించారు. డివిఆర్ బ్రాంచి కెనాల్‌లో 25కోట్లతో చేపట్టిన పనులు టెండర్ షెడ్యూల్ ప్రకారం కాక నాశిరకం మెటీరియల్ వాడి కోట్లాది రూపాయలు దండుకొంటున్నారని ఆరోపించారు.

జగన్‌తోనే సంక్షేమ రాజ్యం
వైఎస్ జగన్‌తోనే సంక్షేమ పాలన సాధ్యమని సామినేని ఉదయభాను అన్నారు. శనివారం పట్టణంలోని మిట్టగూడెంలో రావాలి జగన్ - కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించి నవరత్న పథక కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఇంటూరి రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.