కృష్ణ

ఏ టూ జడ్ బీ అలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివిసీమ పర్యటనకు సంబంధించి జిల్లా అధికారులంతా ఏ టూ జడ్ బీ అలర్ట్‌గా ఉండాలని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం ఆదేశించారు. ఈ నెల 21వతేదీన సీఎం చంద్రబాబు మండల పరిధిలోని ఉల్లిపాలెం-్భవానీపురం వారధి ప్రారంభోత్సవం, ఉల్లిపాలెం గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమానికి హాజరు కానుండగా అందుకు సంబంధించి గ్రామంలో చేపట్టిన ఏర్పాట్లను జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠితో కలిసి సోమవారం కలెక్టర్ పరిశీలించారు. వారధి ప్రారంభం అనంతరం పంచాయతీ కార్యాలయంలో మొక్కలు నాటటంతో పాటు గ్రామదర్శినిలో పాల్గొని ఉల్లిపాలెం శివన్నారాయణ స్వామిని ముఖ్యమంత్రి దర్శించుకునే క్రమం వరకు ప్రతి పాయింట్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఉల్లిపాలెం రక్షిత మంచినీటి చెరువు చుట్టూ ఉన్న వాకింగ్ ట్రాక్‌ను పరిశీలించి పర్యాటక శాఖ నమూనాగా ఏర్పాటు చేసిన కుటీరంలో ఉయ్యాలలను ఏర్పాటు చేయాలని సూచించారు. అక్కడ సీఎం ఒక్కరే కూర్చుని కాపీ సేవించేలా సిద్ధం చేయాలని పర్యాటక శాఖ ఇడీని ఆదేశించారు. రచ్చబండ నిర్వహించే ప్రదేశాన్ని పరిశీలించి లబ్దిదారులను శాఖల వారీగా కూర్చోబెట్టాలని అధికారులకు సూచించారు. ఎస్పీ త్రిపాఠి మాట్లాడు తూ సీఎం పర్యటనకు సంబంధించి పోలీసు శా ఖ తరఫున కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామన్నారు. సీఎం సందర్శి ంచే ప్రతి పాయింట్‌లో సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఈ పరిశీలనలో జాయింట్ కలెక్టర్ విజయకృష్ణన్, జెసీ- 2 పిడుగు బాబూరావు, అవనిగడ్డ డీఎస్పీ పోతురాజు, జెడ్పీ సీఇఓ సలామ్, ఆర్డీఓ ఉదయ భాస్కర్, డ్వామా పీడీ, హౌసింగ్ ఇఇ, మండల ప్రత్యేక అధికారి జె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.