కృష్ణ

అభివృద్ధికి అడ్డం పడే శక్తులను ఉపేక్షించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, : మంచి పనులు, అభివృద్ధి పనులకు అడ్డుపడే శక్తులను క్షమించేది లేదని, వారికి తగిన విధంగా బుద్ధి చెబుతామని ఉపసభాపతి బుద్ధప్రసాద్ హెచ్చరించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో శుక్రవారం నిర్వహించిన జన్మభూమి గ్రామసభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. సామాజిక కుటుంబ వికాసానికి జన్మభూమి గ్రామసభలు దోహద పడుతున్నాయని, ఈ కారణంగా పలు రహదారుల నిర్మాణం చేసుకోవటం జరుగుతుందన్నారు. ఒక్క అవనిగడ్డలోనే 110 సిమెంటు రహదారుల పనులను రూ.15కోట్లతో నిర్మించటం జరిగిందని, మరో 126 పనులు రూ.10కోట్లతో నిర్మిస్తారని తెలిపారు. ఇంటింటికి కుళాయి పథకం కింద రూ.4.95 కోట్లతో పనులు చేపట్టటం జరుగుతుందన్నారు. అలాగే బందలాయిచెరువు నుండి గుడుమోటు వరకు రూ.6కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రహదారి పనులకు బుద్ధప్రసాద్ శంకుస్థాపన చేశారు. రూ.కోటి 35లక్షలతో నిర్మించిన నియోజకవర్గ సమావేశ మందిరాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. నీరు-చెట్టు కింద పలు అభివృద్ధి పనులు చేపట్టామని, కోటి రూపాయల వ్యయంతో మోడల్ పోలీసు స్టేషన్‌ను ప్రారంభిస్తామన్నారు.

జిల్లాలో ముగ్గురు సీఐల బదిలీ

మచిలీపట్నం, జనవరి 11: జిల్లాలో ముగ్గురు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఏలూరు రేంజ్ డీఐజీ రవి కుమార్ మూర్తి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏలూరు రేంజ్ పరిధిలో మొత్తం 13 మంది సీఐలు బదిలీ కాగా జిల్లాకు సంబంధించి ముగ్గురు ఉన్నారు. పెనుగంచిప్రోలు సీఐగా పని చేస్తున్న ఐ అవినాష్‌ను పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీ చేశారు. వీఆర్‌లో ఉన్న ఇరువురు సీఐలకు పోస్టింగ్‌లు ఇచ్చారు. పివిఎస్‌ఎస్‌ఎస్‌ఎన్ సురేష్, ఎం నాగ దుర్గారావులకు రాజమహేంద్రవరం అర్బన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.