కృష్ణ

ఎడ్ల బండ లాగుడు పోటీలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, : గుడివాడలోని లింగవరం రోడ్డులో ఉన్న కే కనె్వన్షన్‌లో ఎన్టీఆర్ టూ వైఎస్సార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు జరిగే జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీలను ఎమ్మెల్యే కొడాలి నాని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రెండు పళ్ళ విభాగంలో పోటీలను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల నుండి 20 జతల ఎడ్లు ఈ పోటీల్లో హోరాహోరీగా తలపడ్డాయి. విజేతలకు వరుసగా రూ.30వేలు, రూ.25వేలు, రూ.22వేలు, రూ.18వేలు, రూ.15వేలు, రూ.13వేలు, రూ.10వేలు, రూ.8వేలు, రూ.5వేల నగదు బహుమతులను అందజేశారు. పోటీల్లో పాల్గొన్న వారందరినీ మెమెంటోలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ రెండు పళ్లు, నాలుగు పళ్ళు, ఆరు పళ్ళు, సేద్య విభాగం, సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. విజేతలకు దాదాపు రూ.18లక్షల నగదు బహుమతులను అందజేస్తామన్నారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, మున్సిపల్ వైస్‌చైర్మన్ అడపా బాబ్జి, పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

యువత ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

బంటుమిల్లి, జనవరి 11: విద్యార్థులు లక్ష్యాలను అధిగమించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని న్యూఢిల్లీ ఏపీ భవన్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నేడు టెక్నాలజీ అభివృద్ధి చెందినా మొబైల్ ఫోన్‌లు విద్యార్థులకు ఒక రకంగా ఆటంకంగా ఉందన్నారు. బంటుమిల్లి డిగ్రీ కళాశాల అభివృద్ధికి సహకరించాలని రైతు సంఘం నాయకులు గౌరిశెట్టి నాగేశ్వరరావు ఆయన దృష్టికి తెచ్చారు. కళాశాల ప్రిన్సిపాల్ బట్టు వేదాంతం ఆహ్వానం మేరకు శ్రీకాంత్ బంటుమిల్లి కళాశాలను సందర్శించారు. విద్యుత్ లేని రోజుల్లో మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రపంచం తమవైపు చూసేలా ఎదిగారన్నారు. డిగ్రీ కళాశాల అభివృద్ధికి త్వరలో రూ.2కోట్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తానన్నారు. పాఠశాల పూర్వ విద్యార్థులు అర్జా శ్రీకాంత్, గౌరిశెట్టి నాగేశ్వరరావును ఘనంగా సన్మానించారు.