కృష్ణ
ఏఈఈ పరీక్షకు 3, 832 మంది హాజరు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 18 February 2019
విజయవాడ (ఎడ్యుకేషన్): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్చే నిర్వహిస్తున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరీక్షలకు 3832 మంది అభ్యర్ధులు హాజరయ్యారని, పరీక్ష ప్రశాంతంగా నిర్వహించామని కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ అన్నారు. నగరంలోని నలంద డిగ్రీ కళాశాలలో జరిగిన పరీక్ష కేంద్రాన్ని ఆదివారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపిపిఎస్సి ఏఇ పరీక్ష నిర్వహణకు నగరంలో 15 కేంద్రాలు ఏర్పాటు చేశామని దీనికి 5610 మంది అభ్యర్ధులు హాజరు కావాల్సీ ఉండగా 3832 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. 68.31 శాతం హాజరు నమోదైందన్నారు. పరీక్ష కేంద్రాలను జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లా పరిశీలించారు.