కృష్ణ

నేడు నాగాయలంకలో సీఎం రోడ్ షో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక, : ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నాగాయలంకలో రోడ్ షో నిర్వహించనున్నారు. గుంటూరు జిల్లా రేపల్లె పర్యటన అనంతరం హెలికాఫ్టర్ ద్వారా చంద్రబాబు నాగాయలంక మండలం వక్కపట్లవారిపాలెం గ్రామానికి చేరుకుంటారు. అక్కడి నుండి ప్రచార రథంపై వక్కపట్లవారిపాలెం, మర్రిపాలెం, రేమాలవారిపాలెం వంతెన మీదుగా నాగాయలంక ప్రధాన కూడలికి చేరుకుని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సీఎం పర్యటనకు సంబంధించిన సీఎం సెక్యూరిటీ అధికారులు జిల్లా అడిషనల్ ఎస్పీ సోమంచి సాయికృష్ణ, అవనిగడ్డ డీఎస్పీ పోతురాజుతో కలిసి కలిసి శుక్రవారం ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించటంతో పాటు సీఎం రోడ్‌షో మార్గాన్ని పరిశీలించారు. అలాగే ఉపసభాపతి బుద్ధప్రసాద్ తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు.

కైకలూరులో
నామినేషన్ల కోలాహలం

కైకలూరు, మార్చి 22: కైకలూరులో నామినేషన్ల కోలాహలం నెలకొంది. కైకలూరు అసెంబ్లీ స్థానానికి ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన జయమంగళ వెంకట రమణ, దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్)లతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి నూతలపాటి పీటర్ పాల్ ప్రసాద్ తమ నామినేషన్ దాఖలు చేశారు. జయమంగళ, డీఎన్నాఆర్‌లు వేర్వేరు తమ అనుచరగణంతో కలిసి నామినేషన్లు దాఖలు చేశారు. ఇరువురు నామినేషన్ల కార్యక్రమానికి వేలాది మంది కార్యకర్తలు తరలి వచ్చారు. ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడంలో పోలీసులకు కష్టతరమైంది. అనంతరం ఇరు పార్టీల నాయకులు గెలుపు మాదే అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఎవరికి వారు పోటాపోటీగా జనసమీకరణ చేయడంతో వాహన చోదకులు పడరాని పాట్లు పడ్డారు.