కృష్ణ

అట్టహాసంగా జనసేన అభ్యర్థి అక్కల నామినేషన్ దాఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: మైలవరం నియోజకవర్గ అసెంబ్లీకి వామపక్షాలు బలపరిచిన జనసేన అభ్యర్థి అక్కల రామ్మోహనరావు(గాంధీ) సోమవారం అట్టహాసంగా తన నామినేషన్ దాఖలు చేశారు. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలోని తన నివాస గృహం నుండి భారీ బైక్ ర్యాలీగా మైలవరం తరలివచ్చి రెండు గంటల సమయంలో రెండుసెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి సలాంకు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని పవన్ కల్యాణ్ రాకతో ఆ లోటును భర్తీ చేస్తాడని ప్రజలు ఆనందంతో ఉన్నారన్నారు. ప్రజలనుండి వస్తున్న స్పందనకు జనసేనకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమైందన్నారు. జనసేనతోనే నీతివంతమైన పాలన సాధ్యమన్నారు. వామపక్ష పార్టీలతో కలసి పోటీ చేస్తున్న తన విజయం ఖాయం అన్నారు. అనంతరం బైక్ ర్యాలీ మైలవరం పురవీధులలో తిరిగింది. ఈకార్యక్రమంలో జనసేన నేతలు బొలిశెట్టి శ్రీకాంత్, జనసేన నేతలు చక్రవర్తి, నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.