కృష్ణ

రబీ ధాన్యం మొత్తం కొంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్: రబీ పంట సాగులో రైతులు పండించిన చివరి ధాన్యపు బస్తావరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని కలెక్టరు ఇంతియాజ్ స్పష్టం చేశారు. శనివారం మండలంలోని బండిపాలెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టరు ఇంతియాజ్ మాట్లాడుతూ జిల్లాలో రబీ పంటలో సుమారు 26,612 హెక్టార్లు సాగుచేయగా ఇందులో 2,1,422లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు పండించినట్లు వ్యవసాయ శాఖాధికారులు అంచనాలు వేసినట్లు తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్ధాయిలో ప్రభుత్వ నిబంధనల మేరకు కనీస మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పారు. జిల్లాలో 171 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న లక్ష్యం కాగా ఇప్పటివరకు 81 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, వీటి ద్వారా ఇప్పటివరకు 2,500 మంది రైతుల నుండి 69 కోట్ల రూపాయల విలువైన 39వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వివరించారు. రైతులు తాము పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో ఏలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దళారీలు, వ్యాపారుల వద్దకు వెళ్ళి తక్కువ ధరకు విక్రయించవద్దని సూచించారు. గ్రేడ్ -ఏ రకానికి క్వింటాకు 1770, కామన్ రకానికి 1750 రూపాయలు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరను చెల్లించడం జరుగుతుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో గొనె సంచులను అందుబాటులో ఉంచామని, అన్ని వౌలిక సదుపాయాలు కల్పించినట్లు ఆయన చెప్పారు. కొనుగోలు కేంద్రాలకు రైస్ మిల్లులను అనుసంధానం చేశామని, రైస్ మిల్లర్లు వారికి కేటాయించిన కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని తరలించుకోవచ్చని కలెక్టరు వివరించారు. కలెక్టరుతో పాటు జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజరు సిహెచ్ రామానుజమ్మ, స్థానిక రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.