కృష్ణ
నోరూరిస్తున్న మామిడి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 23 April 2019
మచిలీపట్నం (కోనేరుసెంటరు): పండ్లలో రారాజు మామిడి మార్కెట్లో నోరూరిస్తున్నాయి. అయితే మధ్య తరగతి ప్రజలు వీటిని చూడటం తప్పితే కొనే పరిస్థితిలో లేరు. గతంలో ఎన్నడూ లేని విధంగా డజను రూ.300 నుండి రూ.500 వరకు పలకటం విశేషం. దీంతో మధ్య తరగతి ప్రజలు వాటిని చూడటం తప్పితే కొనే పరిస్థితిలో లేరు. అయితే కొంత మంది మామిడి ప్రియులు ఎంత ఖరీదైనా కొనుగోలు చేసి తమ జిహ్వచాపల్యాన్ని తీర్చుకుంటున్నారు. ముఖ్యంగా బంగినపల్లి, నూజివీడు రసాలు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. వాతావరణంలో ఏర్పడి మార్పులు వల్ల ఈ ఏడాది మామిడి దిగుబడులు గణనీయంగా తగ్గాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ఈ ఏడాది మామిడి ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండే పరిస్థితి లేదనడంలో సందేహం లేదు.