కృష్ణ

మసీదుల వద్ద పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), జూన్ 3: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పట్టణంలోని అన్ని మసీదుల వద్ద పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చాలని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అబ్దుల్ మతీన్ కోరారు. ఈ మేరకు శుక్రవారం మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. పారిశుద్ధ్యంతో పాటు మసీదులను ఆధునీకరించాలని, మంచినీరు తదితర సదుపాయాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యండి దాదా సాహెబ్, యండి ఇషాక్, షేక్ రబ్బాని, యండి మెహొసీన్, పేరిశెట్టి నాగరాజు, కల్లు వెంకటేశ్వరరావు, షరీఫ్ పాల్గొన్నారు.