కృష్ణ

కాపుల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు మానాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), జూన్ 9: స్వార్ధ రాజకీయాల కోసం కాపులను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు కాపు నేతలు సూచించారు. స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్, టిడిపి సీనియర్ నేత బూరగడ్డ రమేష్‌నాయుడు, మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాథం మాట్లాడుతూ కాపుల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసత్య ప్రచారం చేస్తున్న ముద్రగడకు కాపులే తగిన గుణపాఠం చెబుతారన్నారు. స్వార్ధ రాజకీయం కోసం ముద్రగడ చేస్తున్న దీక్షలను కాపులు గమనిస్తున్నారన్నారు. ప్రతిపక్ష నేత జగన్ కనుసన్నల్లో ముద్రగడ ఉద్యమం పేరుతో అరాచకాలు సృష్టిస్తున్నాడని ఆరోపించారు. దీన్ని కాపు సోదరులంతా ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో 9వ వార్డు కౌన్సిలర్ కొట్టె వెంకట్రావ్, టిడిపి నాయకులు తలారి సోమశేఖర్, కుంచే దుర్గాప్రసాద్, భావిరెడ్డి మార్కండేయులు, దారపురెడ్డి సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.