కృష్ణ

40 మంది వికలాంగులకు బస్‌పాస్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, ఏప్రిల్ 5: స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో మంగళవారం ఉయ్యూరు ఆర్టీసీ డిపో మేనేజర్ జెఎస్ రత్నకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో 40 మంది వికలాంగులకు బస్‌పాస్‌లు అందజేశారు. వికలాంగులు ఉయ్యూరు డిపోకు రాలేక పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ శిబిరం ఏర్పాటు చేసినట్టు మేనేజర్ తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శిబిరం నిర్వహించారు. దూరగ్రామాల వికలాంగులు రాలేదని, అందువల్ల రెండు, మూడు గ్రామాలకొక శిబిరం ఏర్పాటు చేస్తామని రత్నకుమార్ తెలిపారు. సిబ్బంది సీహెచ్ వెంకటేశ్వరరావు, యు రామకృష్ణ, కె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.