కృష్ణ

పత్తి కొనుగోలు కేంద్రంలో ఎమ్మెల్యే రక్షణనిధి తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంపలగూడెం: స్థానిక పత్తి కొనుగోలు కేంద్రంలో తిరువూరు శాసనసభ్యుడు కొక్కిలిగడ్డ రక్షణనిధి బుధవారం తనిఖీ గావించారు. సీసీఐ పత్తి కొనుగోలు చేసేందుకు ఈక్రాప్‌లో పంట నమోదు లేని కారణంగా రైతులు నష్టపోతున్నారని తిరువూరు శాసనసభ్యులు కె రక్షణనిధి సమస్య పరిష్కరించాలని జిల్లా కలెక్టరుకు ఫోన్ ద్వారా వివరించారు. సమస్యను సానుకూలంగా పరిష్కరిస్తానని కలెక్టరు తెలిపినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇది రైతు ప్రభుత్వమని, ఏ రైతు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈకార్యక్రమంలో బయ్యర్ దిలీప్, మార్కెట్‌యార్డు కార్యదర్శి బత్తుల సౌజన్య, తహశీల్దార్ బి కోటేశ్వరరావు, వైసీపీ జిల్లా స్టీరింగ్ కమిటి సభ్యులు చెరుకు నర్సారెడ్డి, మండల శాఖ అధ్యక్షులు చావా వెంకటేశ్వరరావు, పలు సహకార సంఘాల అధ్యక్షులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కేసీపీ సిమెంట్ యూనిట్‌కు జాతీయ అవార్డు

జగ్గయ్యపేట రూరల్, డిసెంబర్ 4: 2017-18, 2018-19 సంవత్సరాలకు గాను ప్రతిష్టాత్మకమైన జాతీయ ఉత్తమ ఎనర్జిఎఫిషియన్సి ఎన్వీరాల్‌మెంట్ అవార్డు కేసీపీ సిమెంట్ యూనిట్‌కు లభించిందని ఆసంస్ధ ఉపాధ్యక్షులు వి మదుసూధనరావు తెలిపారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పరిశ్రమల శాఖమంత్రి పియూష్‌గోయల్ అవార్డు ప్రధానం చేసినట్లు చెప్పారు. గతంలో 2015-16, 2016-17 సంవత్సరాలకు కూడా తమ సంస్థకు ఈ అవార్డు లభించిందని, సంస్థ యాజమాన్యం అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తు ప్రోత్సహించడం వల్ల నిర్ధిష్ట ప్రణాళికలతో పనిచేయడం జరుగుతుందని , సంస్థ ఉద్యోగుల సమిష్టి కృషికి ఈ అవార్డును నిదర్శనంగా తెలిపిన ఆయన ఉద్యోగులందరికి శుభాకాంక్షలు తెలిపారు.