కృష్ణ

పచ్చదనంతో రాష్ట్రం నిండిపోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, జూలై 29: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపు మేరకు వనం - మనం కార్యక్రమంతో రాష్ట్రం మొత్తం పచ్చదనంతో నిండిపోయేలా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య అన్నారు. వనం - మనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని పాములలంక గ్రామ రహదారి వెంట విద్యార్థులతో కలసి వర్ల రామయ్య మొక్కలు నాటారు. తొలుత విద్యార్థులు, అధికారులు, పార్టీ నాయకుల చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాట్లాడుతూ కాలుష్య రహిత సమాజాన్ని స్థాపించాలంటే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మొక్కలు నాటాలని తెలిపారు. వృక్ష సంపద సరిగా లేకపోవటం వల్లే సకాలంలో వర్షాలు సరిగా పడటంలేదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు నాలుగు మొక్కలు నాటాలని కోరారు. చెట్లు నాటటమే కాదు వాటిని సంరక్షించాల్సి బాధ్యత అందరిపైనా ఉందని తెలిపారు.