కృష్ణ

విషాదం మిగిల్చిన విహార యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూలై 31: విహార యాత్రలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితురాలి పుట్టినరోజు వేడుక ఇద్దరి జీవితాలనే కడతేర్చింది. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లికి చెందిన టేకుపూడి అక్షిత(19) తన జన్మదినం కావటంతో అదే ప్రాంతానికి చెందిన స్నేహితులు అమర్లపూడి ప్రవీణ్ జై(20), పొన్నం ఆదర్శ్(21), నల్లమోతి వినయ్ ప్రమోద్(20), యడ్ల స్వాతి(19)తో కలిసి ఆదివారం మంగినపూడి బీచ్‌కు విహార యాత్రకు వచ్చారు. వీరిలో ముందుగా ప్రవీణ్, అక్షిత స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగారు. స్నానం చేస్తుండగా అలల ఉద్ధృతికి ఉక్కిరిబిక్కిరయ్యారు. దీన్ని గమనించిన స్థానిక బీచ్ ఫొటోగ్రాఫర్లు, పోలీసులు వారిని రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చి ప్రథమ చికిత్స అందించారు. 108 అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా వారు మార్గంమధ్యలోనే మృతి చెందారు. కుటుంబ సభ్యులెవ్వరికీ చెప్పకుండా వీరంతా విహార యాత్రకు రావడం, ఇద్దరు స్నేహితులు తమ కళ్లముందే ప్రాణాలు విడవటంతో మిగిలిన ముగ్గురు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న బందరు తాలుకా ఎస్‌ఐ మహేష్ తన సిబ్బందితో హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్ళి స్నేహితుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతి చెందిన అక్షిత విజయవాడలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాల విద్యార్థిని. ప్రవీణ్ పాలిటెక్నిక్ పూర్తిచేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు.