కృష్ణ

సస్పెండైనా రోజాలో మార్పు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ, అక్టోబర్ 15: శాసనసభ నుండి సస్పెండ్ అయినా రోజాలో ఎటువంటి మార్పు రాలేదని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రోజా ప్రవర్తన తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విలేఖరుల సమావేశంలో రోజా మాట్లాడిన తీరు తీవ్ర అసహ్యంగా, అభ్యంతరకరంగా ఉందన్నారు. వెకిలి వేషాలు వేయడానికి, డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడటానికి ఇది జబర్దస్త్ కాదని, ఇది నిజ జీవితం అన్న విషయం ఆమె గుర్తించాలన్నారు. రోజా ఒక ఖాళీ డబ్బా, ఆ డబ్బాలో జగన్ ఏ రాళ్లు వేస్తే ఆ మోత వినిపిస్తుందని ఎద్దేవా చేశారు. చట్ట సభలపై ఆమెకు ఏ మాత్రం గౌరవం లేదన్నారు. ఇదే విధంగా ప్రేలాపనలు చేస్తే పుట్టగతులు ఉండవన్నారు. లక్షల కోట్ల స్కామ్ చేసింది ఎవరో చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారని, ఇప్పటికైనా పనికి మాలిన మాటలు మానుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పారదర్శకంగా అవినీతి రహిత పాలన అందిస్తుంటే చూసి ఓర్వలేక ఇష్టం వచ్చినట్లు ప్రేలాపనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నవంబర్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకూ జరిగే జనచైతన్య యాత్రల విజయవంతానికి నేతలు కృషి చేయాలన్నారు. నగర పంచాయతీ చైర్‌పర్సన్ యరగొర్ల పద్మావతి, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి వీరబాబు, కంచికచర్ల జడ్‌పిటిసి కోగంటి బాబు పాల్గొన్నారు.