కృష్ణ

నిరంతర పర్యవేక్షణతో రోడ్డు ప్రమాదాల నివారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, ఏప్రిల్ 23: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారించామని, నిరంతరం సమీక్షలు, సమావేశాలు నిర్వహించడం ద్వారా మరణాల సంఖ్య తగ్గించగలిగామని కలెక్టర్ బీ లక్ష్మీకాంతం తెలిపారు. 29వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాలను పురస్కరించుకొని సోమవారం బెంజిసర్కిల్ సమీపంలోని జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ హాలులో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరిలో అవగాహన ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమాదాల నివారణ పట్ల ఇన్‌ఫరమేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్, (ఈఈసీ) చాలా ముఖ్యమన్నారు. అదే విధంగా ఇన్‌ఫర్‌మేషన్, మోటువేషన్, ఫెసిలిటేషన్ ఆవశ్యకత ఉందన్నారు. ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతాయో అలాంటి చోట్ల స్థానికుల్లో అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. బ్లాక్స్ స్పార్ట్స్, లైటింగ్ లేని చోట్ల అప్రమత్తత అవసరం ఉందన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే చికిత్స అందితే ప్రాణాన్ని రక్షించవచ్చన్నారు. దీనికోసం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను అనుసంధానం చేస్తూ రక్షా అనే యాప్ రూపొందిస్తున్నామన్నారు. ఈ యాప్ ద్వారా ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గుర్తించడంతోపాటు అక్కడ దగ్గరలోని ఆసుపత్రి వివరాలు తెలుసుకునే సదుపాయం ఉంటుందన్నారు. గాయపడిన వారికి సకాలంలో వైద్య సేవలు అందించడం ద్వారా ప్రాణాపాయం నుండి కాపాడవచ్చన్నారు. జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలకు రోడ్డు ఇంజనీరింగ్ వ్యవస్థ వలన కొన్ని ప్రమాదాలు జరుగుతాయన్నారు. ఇలాంటి వాటిని నివారించాల్సి ఉందన్నారు. ప్రమాదాలు సూచించే బోర్డులు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయడం వలన ప్రమాదాలు నివారించవచ్చన్నారు. వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాల్సి ఉందని, ప్రజల్లో కూడా మార్పు రావాల్సి ఉందన్నారు. జిల్లా డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్ ఈ మీరాప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రణాళికబద్దంగా పనిచేస్తున్నామన్నారు. ఈ నెల 23 నుండి 30 వరకు జరిగే రోడ్డు భద్రత వారోత్సవాలు సందర్భంగా ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించనున్నామని చెప్పారు. ఈ కార్యక్రంమలో ట్రాన్స్ పోర్టు జాయింట్ కమిషనర్ ఎస్‌ఏవీ ప్రసాద్, ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ పిన్నమనేని రామారావు, వైవీ ఈశ్వరరావు, కోనేరు వెంకట రామారావు, అడుసుపల్లి సదాశివరావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు రోడ్డు ప్రమాదాల నివారణకు తెలిపే సీడీలు, కరపత్రాలను కలెక్టర్, ఇతర అధికారులు పంపిణీ చేశారు.

విద్యార్జనతోనే మానవుడు పరిపూర్ణ వ్యక్తిగా మారతాడు
* ఉప సభాపతి బుద్ధప్రసాద్
అవనిగడ్డ, ఏప్రిల్ 23: విద్యార్జన ద్వారానే మానవుడు పరిపూర్ణమైన వ్యక్తిగా రూపొందుతాడని ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక ప్రగతి విద్యా సంస్థల 27వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బుద్ధప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో ఉపాధ్యాయుల బోధనల ద్వారానే సమరయోధులు తయారయ్యారన్నారు. భవిష్యత్ ఉపాధ్యాయులకు రోల్ మోడల్‌గా ప్రగతి సంస్థల అధినేత పూర్ణచంద్రరావు ఉంటారని, ఆయన నిరంతర కృషి ద్వారానే అవనిగడ్డకు ఒక గుర్తింపు రావటంతో పాటు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అవనిగడ్డ వైపు చూస్తున్నారన్నారు. అవనిగడ్డ ఆర్థికాభివృద్ధికి కూడా తోడ్పాటు ఇస్తున్నారన్నారు. సమాజ వికాసానికి దోహద పడాల్సిన రాజకీయాలు ఓట్లు కోసం, అధికార దాహానికి దోహద పడుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. క్రమశిక్షణతో భవిష్యత్తుకు బాటలు వేసేందుకు గాను కందుకూరి వీరేశలింగం సంస్కరణలను ఆవస్యం చేసుకోవాలని బుద్ధప్రసాద్ హితవు పలికారు. విద్యా సంస్థల కరస్పాండెంట్ సనకా పూర్ణచంద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీఎస్పీ పోతురాజు, ప్రైవేటు పాఠశాలల సంఘం అధ్యక్షుడు తుమ్మల రత్న, గౌరవాధ్యక్షుడు మోహనరావు, సనకా నాయుడమ్మ తదితరులు ప్రసంగించారు. అంతకుముందు విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ అంశాలలో విజేతలైన విద్యార్థులకు బుద్ధప్రసాద్ చేతులు మీదుగా బహుమతులు ప్రదానం చేశారు.