కృష్ణ

మంచినీటి ఎద్దడి రానివ్వకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 19: వేసవిలో మంచినీటి సమస్యను అధిగమించేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో స్థారుూ సంఘ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంచినీటి సరఫరా, గృహ నిర్మాణం, విద్య, వైద్యం, ఉపాధి హామీ పనులు తదితర అంశాలపై సమీక్షించారు. చైర్‌పర్సన్ అనూరాధ మాట్లాడుతూ వేసవి కావటంతో ఏ గ్రామంలోనూ మంచినీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. మంచినీటి సమస్య ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అవసరమైతే శివారు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. పైప్‌లైన్ లీకేజీల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. బిల్లుల చెల్లింపులో జరుగుతున్న జాప్యాలను నివారించాలన్నారు. లబ్ధిదారులను ఒకటికి పది సార్లు తిప్పుకోకుండా సమస్యలు పరిష్కరించాలన్నారు. వేసవి సెలవు నేపథ్యంలో పాఠశాలల్లో వౌలిక వసతులు కల్పించాలన్నారు. పాఠశాలల పునః ప్రారంభం నాటికి పాఠ్య పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా ప్రమాణాలు పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. వృద్దాప్య, వికలాంగ పెన్షన్ల పంపిణీలో లబ్ధిదారులను ఎటువంటి ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు. సాంకేతికపరమైన ఇబ్బందులు ఉంటే ముందుగానే సవరించుకోవాలన్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో సాగుతున్న పడవ ప్రమాదాలపై అధికారుల పర్యవేక్షణ ఉండాలన్నారు. లైసెన్సులు లేకుండా పడవలు నడిపే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. పీహెచ్‌సీల్లో వైద్య సేవలను మరింత మెరుగుపర్చాల్సిన అవసరం ఉందన్నారు. వడదెబ్బ నివారణకు విస్తృతంగా మందులు పంపిణీ చేయాలన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్‌పర్సన్ శాయన పుష్పవతి, సీఇఓ కె శ్రీదేవి, పలువురు జెడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.