కరీంనగర్

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మారం, ఆగస్టు 29: మండలంలోని బొట్లవనపర్తి గ్రామ పరిధిలోని బుచ్చయ్యపల్లిలో చెంచు బీరయ్య (44) అనే రైతు విద్యుత్ షాక్‌తో మృతి చెందినట్లు ధర్మారం ఎస్‌ఐ హరిబాబు తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం..రైతు బీరయ్య సోమవారం ఉదయం తన పొలం వద్దకు వెళ్లి మోటార్ ఆన్ చేయడంతో అకస్మాత్తుగా విద్యుత్ ప్రవహించి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య మల్లేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

అప్పులతో నేత కార్మికుడు ఆత్మహత్య
సిరిసిల్ల, ఆగస్టు 29: సిరిసిల్ల మండలం ముష్టిపల్లిలోని రాజీవ్‌నగర్‌లో అప్పుల బాధతో పవర్‌లూం కార్మికుడు తొర్ర ఎల్లయ్య(55) ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం తన ఇంటిలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిపారు. కొంత కాలంగా అప్పులతో ఎల్లయ్య బాధపడుతున్నట్టు తెలిసింది. సిరిసిల్ల పోలీసుల కేసు దర్యాప్తు చేస్తున్నారు.