కరీంనగర్

భూమి కోసం మహిళ ఆత్మహత్యా యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, సెప్టెంబర్ 1: భూమి కోసం ఓ మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన ఇక్కడ చర్చనీయాంశమైంది. జీవనాధారంగా ఉన్న భూమిని కొంత మంది ఆక్రమించుకోవడంతో, అధికారులకు ఫిర్యాదు చేసినా, పట్టించుకోవడం లేదని మనస్తాపం చెందిన మహిళ ఆత్మహత్యయత్నం చేసింది. బాధితురాలు భర్త మల్లయ్య కథనం ప్రకారం.. మండలంలోని అప్పన్నపేటకు చెందిన వరలక్ష్మి అనే మహిళ గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిగా, ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకెళ్లారు. గ్రామ సమీపంలో సర్వే నెంబర్ 134లో తమ పేరిట కబ్జాలో ఉన్న ఎకరం భూమిని పక్కనే ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆక్రమించుకున్నారని మల్లయ్య తెలిపాడు. ఈ విషయమై స్థానిక రెవిన్యూ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయాడు. తమ భూమి దక్కదనే ఆందోళనలో ఉన్న తన భార్య ఆత్మహత్యయత్నానికి పూనుకుందని వివరించాడు. ఈ మేరకు బసంత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.