కరీంనగర్

ప్రజావాణిలో రైతు ఆత్మహత్యా యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, జనవరి 22: జిల్లా కేంద్రంలోని ఐఎంఎ భవన్‌లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న కలెక్టర్ ప్రజావాణిలో సారంగాపూర్ మండలం రేచపల్లికి చెందిన రైతు చిట్యాల గంగారం (32) సోమవారం ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం సాగు చేసుకుంటున్న ఎకరన్నర భూమి తన పేరిట అమలు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోగా, కొనుగోలు చేసిన వ్యక్తి చనిపోవడం, అతని కుమార్తె కౌలు ఇచ్చినట్లు పేర్కొనడంతో అమలుకు జాప్యం జరిగింది. ఈ కారణం వల్ల అతను తీవ్ర మనస్థాపం చెంది ఈ ఘాత్యానికి ఒడిగట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కలెక్టర్ ప్రజావాణిలో అధికారులకు తన దరఖాస్తు అందించే క్రమంలో పురుగుల మందు తాగి వచ్చిన గంగారం కుప్పకూలడంతో ప్రజావాణిలో విధులు నిర్వహిస్తున్న ఏఓ మహేశ్వర్ వెంటనే 108కి సమాచారం అందించారు. దాంతో అతన్ని జిల్లా ఆసుపత్రిలో చేర్చి అత్యవసర వైద్యం అందిస్తుండగా, 7గంటల సమయంలో అతని పరిస్థితి విషమించడంతో ఇక్కడి వైద్యులు కరీంనగర్ కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.