కరీంనగర్

న్యాయం చేయాలని రైతు కుటుంబం ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, జనవరి 23: పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన రేచపల్లి రైతు చిట్యాల గంగయ్య కుటుంబానికి న్యాయం చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట మృతదేహంతో బైఠాయించి దళిత సంఘాలతో పాటు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ప్రజావాణిలో దరఖాస్తు చేస్తూ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడగా, కరీంనగర్‌లో చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. దీంతో మంగళవారం పెద్ద ఎత్తున తరలివచ్చిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, దళిత సంఘాల నాయకులు ఆందోళన చేయడంతో ఇరువైపులా రాకపోకలు నిలిచిపోవడంతో పోలీసులు దారి మళ్లీంచి రాకపోకలను క్రమబద్దీకరించారు. కాగా మృత కుటుంబ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెల్లడంతో కలెక్టర్ లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేస్తే న్యాయం చేస్తానని హామి ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యుల తరపున ఒక వినతి పత్రాన్ని అందచేశారు. అలాగే విరాసత్ విషయంలో నిజాలను విచారించి న్యాయం చేయాలని పేర్కొన్నారు. కాగా ఈ విషయంలో అర్డీఒచే విచారణ జరిపించి తగు న్యాయం చేస్తామన్నారు.